BPT: మంగళవారం బాపట్ల చేరుకున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జిల్లాకు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని రెవెన్యూ శాఖపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.