NDL: ఆత్మకూరు కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన సదస్సు ఇవాళ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరన్ ఆదేశాలతో డీఎస్పీ ఆర్.రామాంజి నాయక్, అర్బన్ సీఐ ఓ. మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి బంగారు భవిష్యత్తు సాధించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.సమస్యలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.