MHBD: గార్ల మండల కేంద్రంలోని మహావీర్ రైస్ మిల్లు బజారుకు చెందిన నల్లమాస ఉపేందర్ ఈనెల 21న చేపలు పట్టేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య ఇందిరా తన భర్త కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ పేర్కొన్నారు.