E.G: కొవ్వూరు MEO-1గా బాధ్యతలు చేపట్టిన ఉందుర్తి శాంసన్ శనివారం MLA ముప్పిడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని MLA ఆదేశించారు. మండలం వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ భేటీలో UTF నాయకులు పల్లికొండ, విజయ్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.