NZB: బోధన్ పట్టణంలోని రాకాస్ పేట్లో, పాత బోధన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆధునిక హైమాస్ట్ లైట్లను మున్సిపల్ ఛైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రాంత ప్రజలకు రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందించాలనే ఉద్దేశంతో ఈ లైట్లను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ ఎలక్ట్రిషన్, తదితరులు పాల్గొన్నారు.