ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు పట్ల వైయస్సార్, జగన్ మాత్రమే శ్రద్ధ తీసుకొని వెలుగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినట్లు కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అబద్ధపు మాటలు తప్ప నిజాలు మాట్లాడిన దాకలు లేవని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.