MHBD: తొర్రూర్ పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం అమపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు కొడుకులను ఉరివేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.