NDL: కొలిమిగుండ్ల(మం) కోరుమానుపల్లిలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామ సమీపంలో ఉన్న గుండం ఆంజనేయ స్వామి వద్ద నూతనంగా నిర్మించిన పట్టాభి రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.