TG: మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రూ. 150 కోట్ల విలువైన కోకాపేట్ భూములను.. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రూపాయికే శారదా పీఠానికి ఇచ్చారన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో మెట్రో, మూసీ అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.