KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరిలో రేపటి నుంచి పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. కరుణగిరి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ టోర్నీ వాల్పోస్టర్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు.