MNCL: లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు వివిధ చట్టాలపై అవగాహన పెంచుకున్నారని స్థానిక ఎంపీడీవో సరోజ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. నూతన వార్డు సభ్యులకు ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వారికి పంచాయతీరాజ్ చట్టం, గ్రామపంచాయతీ విధులు, నిధులు, బాధ్యతల గురించి వివరించామన్నారు.