KMR: ధర్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు గ్రామసభ నిర్వహించనున్నట్లు సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై చర్చించి, ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ప్రజలందరూ హాజరుకావాలని కోరారు.