W.G: అండలూరులో విద్యుత్ స్తంభంపై పని చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. పోడూరు మండలం వద్దిపర్రకు చెందిన అజయ్ కుమార్ (18) అండలూరులో శుక్రవారం స్తంభంపై పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి కిందపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.