VSP: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పెందుర్తి జోన్ 96వ వార్డు యాతపేటలో పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అర్హులందరికీ ప్రతి నెల పింఛన్ అందజేస్తున్నామని అన్నారు.