AP: రాష్ట్రానికి బ్లూజెట్ సంస్థ రావడం శుభసూచికమని మంత్రి లోకేష్ అన్నారు. ఏపీ డబుల్ ఇంజిన్ సర్కారే కాదని.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని పేర్కొన్నారు. నమో అంటే నరేంద్రమోదీ అని అదరికీ తెలుసు అని తెలిపారు. ఏపీలో నమో అంటే నాయుడు, మోదీ అని అంటారని చెప్పారు. కేంద్రంలో మోదీ.. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడించారు.