WGL: 20వ డివిజన్ కాశీబుగ్గలో అధిక వడ్డీ ఇస్తానని ప్రజలను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక కిరాణా వ్యాపారి వీరశెట్టి సురేశ్ స్థానికులను నమ్మించి దాదాపు ఒక కోటి రూపాయల వరకు వసూలు చేసి పరారయ్యాడు. 15 రోజుల క్రితం తన షాపుకు తాళం వేసి అప్పటి నుంచి కనిపించకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.