కోనసీమ: కులాంతర వివాహం ఇష్టం లేని కారణంతోనే ద్వారపూడికి చెందిన పోలుపల్లి వీరవెంకట సూర్య ప్రకాశరావును యువతి సోదరులు హత్య చేసినట్లు రూరల్ సీఐ దొరరాజు తెలిపారు. అయినవిల్లి డిప్యూటీ తహశీల్దార్ సంధ్య, ఆమె సోదరుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. మృతుడి ఇంటి వద్దకు వెళ్లి రాళ్లతో దాడి చేయడంతో రక్తస్రావమై మృతి చెందారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.