BPT: సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, టీడీపీ నేత వర్ల రామయ్య శుక్రవారం సీఐడీ డీజీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు తిరస్కరించినా వారిలో ఎలాంటి మార్పు రాలేదని నసీర్ మండిపడ్డారు.