కడప: ఐఎంఏ హాల్లో ఈనెల 28, మార్చి 1 తేదీల్లో వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో పుత్తా పుల్లారెడ్డి సాహిత్యంపై జాతీయ సదస్సు జరగనుంది. ఈసదస్సులో ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, వీసీలు జయరామిరెడ్డి, నిత్యానందరావు పాల్గొంటారు. ఈ సందర్భంగా శృంగార శాకుంతలం గ్రంథావిష్కరణ,18 మంది పరిశోధకులతో పత్ర సమర్పణలు ఉంటాయని అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి తెలిపారు.