ADB: గణితాన్ని సులువైన పద్ధతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తి చూపుతారని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ‘ఫస్ట్ ఇన్ మ్యాథ్స్’ పేరుతో వినూత్న పైలెట్ ప్రాజెక్టును ఆయన నిన్న ప్రారంభించారు. విద్యార్థులు లెక్కలను కేవలం పరీక్షల కోసం కాకుండా, జీవిత నైపుణ్యాలుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.