SS: గోరంట్లలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం జెండా ఆవిష్కరణ చేశారు. సీఐటీయూ నాయకుడు రమేశ్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక న్యాయం కోసం సీఐటీయూ పోరాటాలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టం కలిగించేలా ఉన్నాయని విమర్శిస్తూ, వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.