CTR: పలమనేరులో ఈనెల 19వ తేదీన ఛత్రపతి శివాజీ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ సంఘాల సభ్యులు తెలిపారు. ఈ శోభాయాత్ర పలమనేరు లయన్స్ క్లబ్ నుంచి ప్రారంభమై, రెక్కమాను సర్కిల్, జిలాని సర్కిల్, పెట్రోల్ బంక్, యంబీటి రోడ్డు, జవిలి వీధి మీదుగా తిరిగి లయన్స్ క్లబ్ వద్దకు చేరుకుంటుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.