KMM: భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులను గుర్తిస్తున్నామని, అసలైన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బాధితులకు ఎక్కడ స్థలం ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. స్థలం లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. భూదాన్ స్థలాన్ని మోసపూరితంగా అమ్మినవారు జైల్లో ఉంటారని తెలిపారు.