VZM: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించారు. ఈ జరిమానాలను అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ MSHR తేజ చక్రవర్తి విధించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.