TG: రెవెన్యూ సదస్సులో 9 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. భూభారతిలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా.. 6 నెలలైనా పాస్ బుక్ రావడం లేదన్నారు. స్లాట్ రద్దు చేసిన వారికి రెండున్నరేళ్లు అయినా.. ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు.