TG: గత పదేళ్ల BRS పాలనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై KTR, హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో గత పాలకులు జేబులు నింపుకున్నారని, 1.08 లక్షల కోట్లు ఖర్చు చేసినా కేవలం 110TMCలే అందుబాటులోకి వచ్చాయని విమర్శించారు. ఎనిమిదో వింతగా చెప్పుకున్న ప్రాజెక్టు పేక మేడలా కూలిపోయిందని ఎద్దేవా చేశారు.