JGL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ ప్రజల నిరీక్షణకు తెరపడింది. గత ఏడాది కాలంగా గ్రామానికి కోరుట్ల డిపోకు చెందిన బస్సు సర్వీస్ నిలిపివేయబడగా, గురువారం సర్వీస్ను మళ్లీ పునరుద్ధరించారు. డిపో మేనేజర్ తీసుకున్న నిర్ణయంతో బస్సు రాకపోకలు తిరిగి ప్రారంభం కావడం వల్ల గ్రామస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.