NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు జెన్కో ఎస్ఈ వి.జగదీశ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 500 క్యూసెక్కులతో మొదలై, 2 గంటల వరకు ప్రవాహం 2,000 క్యూసెక్కులకు పెరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి నదిలో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.