AKP: నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పీ. షియాజ్ ఖాన్ గురువారం స్థానిక సబ్ జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలకు అందుతున్న ఆహారాన్ని తనిఖీచేసారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలు పట్ల ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖైదీలు ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకుంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.