KRNL: ఆదోని మండలంలో కొత్తగా ఏర్పడిన సుల్తానాపురం, చాగి గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరయినప్పటికీ పనులు ప్రారంభం కాలేకపోతున్నాయి. సుల్తానాపురానికి రూ.32 లక్షలు, చాగి గ్రామానికి రూ.32లక్షలు మంజూరు చేసినట్లు AE యమునప్ప ఇవాళ తెలిపారు. అయితే గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి తగిన స్థలాలు అందుబాటులో లేకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు.