మార్కాపురంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు గురై బోడపాడు గ్రామ పొలాల్లో ఒంటేరు పోలమ్మ అనే మహిళ మృతి చెందింది. మరొక మహిళకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈదురుగాలులకు బోడపాడులోని కోళ్ల ఫారం షెడ్డు కూలి చింతకుంట్ల కుమారి అనే మరో మహిళా మృతి చెందింది.