CTR: వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పుంగనూరు జర్నలిస్టుల యూనియన్ నాయకులు సలీం డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.