ఏపీ శాసన మండలిలో రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ MLC ఇసాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం నుంచి 800 అడుగులలోపు నీటిని తెలంగాణ తరలిస్తోందని, దీనిని అడ్డుకోవడానికి గత ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ తెచ్చి 80 శాతం పనులు పూర్తి చేసిందని గుర్తుచేశారు. అయితే, చంద్రబాబుతో మాట్లాడి ఈ ప్రాజెక్టు పనులను ఆపించామని TG సీఎం రేవంత్ స్వయంగా చెప్పారని ఆయన ఆరోపించారు.