SS: అమరాపురం మండలం కె. శివరం పంచాయతీ పరిధిలో ఉన్న కె. గొల్లహట్టి గ్రామస్తుల తాగునీటి సమస్య పరిష్కారమైంది. చాలా కాలంగా నీటి ఇబ్బందులతో సతమతమవుతున్న గ్రామం గురించి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. అధికారులను ఆదేశించి గురువారం తెల్లవారుజామున గ్రామంలో బోర్వెల్ వేయించారు.