ASR: దంపతుల మధ్య వచ్చిన మనస్ఫర్థలతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొయ్యూరు మండలం క్రిష్టారం గ్రామానికి చెందిన రవిబాబు తన భార్యతో గొడవపడి ఈనెల 21న ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సె కిషోర్ వర్మ తెలిపారు.