PPM: జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు. నీతి ఆయోగ్ అధికార ప్రతినిధి ఆయుషి అగర్వాల్ బుధవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలసి జిల్లా సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికపై వివరించారు.ఈ పర్యటనలో జిల్లా అధికారులు, నీతి అయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.