KNR: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 15,389 మందికి గాను 14,989 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పలు కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.