TPT: గూడూరు మండల పరిధిలోని కొండ గుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, అయ్యవారి పాలెం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా పయనం సాగించాలన్నారు.