ASF: ఆసిఫాబాద్ మండలం దానాపూర్ గ్రామంలో బుధవారం సమగ్ర భూ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. భూ సర్వే ద్వారా ప్రతి ఎకరాకు స్పష్టమైన రికార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైతులు తమ భూములను చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో భూ తగాదాలు రావని, ఆస్తి హక్కులు భద్రంగా ఉంటాయని పేర్కొన్నారు.