GNTR: పిల్లలే రాష్ట్ర భవిత… రేపటి చరిత్ర సృష్టించేది నేటి విద్యార్థులే” అని విద్యా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమ్మలాంటి మాతృభాష తెలుగును ఎప్పటికీ మరవొద్దని సూచించారు. అసెంబ్లీని సందర్శించేందుకు వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థులతో బుధవారం అసెంబ్లీ లాబీలో మంత్రి స్నేహపూర్వకంగా ముచ్చటించారు.