TG: గ్రామీణ ప్రజలకు నిరంతర, నాణ్యమైన తాగునీటి సరఫరా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ సోర్స్ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, గ్రామాల వారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వలో ఉందని, వేసవిలోనూ పెద్ద ఇబ్బందులు ఉండవని అన్నారు.