పాలమూరు విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీయూ పరిధిలోని డిగ్రీ, ఇంటర్ (N.S.S) వాలంటీర్లు పాల్గొనవచ్చన్నారు. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.