JGL: పదవ తరగతి విద్యార్థులు తరగతులకు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు అన్నారు. రాయికల్ మండలంలోని అల్లీపూర్ పాఠశాలలో మంగళవారం 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు రాస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దని, పరీక్షలకు హాజరయ్యేంత వరకు తరగతులకు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.