VKB: మున్సిపల్ పరిధిలోని 34వ వార్డు అయ్యప్ప కాలనీలో రోడ్డుపై నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రతిరోజు నీరు వెళ్లడంతో ఈ మార్గాన వెళ్లే వాహనాలు ప్రజలు కాలనీవాసులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. సంబంధిత వార్డు కౌన్సిలర్ స్పందించి ఈ సమస్యని తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.