అనకాపల్లి: ఈనెల 23న తగలపువలసలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ సెలెక్షన్స్ ట్రయల్స్లో మాకవరపాలెం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తైక్వాండో విభాగంలో దువ్వు అనురాధ, పోలవరపు దేవి, యడ్ల హాసిని, కరాటే విభాగంలో కెఎన్.లోకనాథ్ తమ తమ విభాగాల్లో మొదటి స్థానాలు సాధించి అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని యూనివర్సిటీ సిబ్బంది అభినందించారు.