నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ లో అర్జీలు సమర్పించవచ్చని, 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.