చిత్తూరు: పుంగనూరు పట్టణంలో ప్రభుత్వ బసవరాజ బాలికల, బాలుర కళాశాలలో సోమవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో 332 మంది విద్యార్థులకు గాను 318 విద్యార్థులు హాజరయ్యారని, 14 మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర నాయుడు తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు చెప్పారు.