అన్నమయ్య: రైల్వేకోడూరు మండలంలోని కే.బుడుగుంటపల్లి పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామంలో 7 రోజులుగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సీతా సమేత శ్రీరామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామస్తులందరూ కలిసికట్టుగా, ఉభయ దాతల సహకారంతో ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.