రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి ‘ఈగల్ ఫోర్స్’ చేపడుతున్న చర్యలపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 4 నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లు, 7 ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ ద్వారా నిఘా పెంచినట్లు తెలిపారు. యువతలో అవగాహన పెంచుతూ, విభాగాల సమన్వయంతో డ్రగ్స్ నెట్వర్క్ను ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు.