ప్రకాశం: పుల్లలచెరువు మండలం మురికిమల్ల తండా వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. మృతుడు మండలంలోని చెన్నంపల్లికి చెందిన చిన్న గురవయ్యగా పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లా నుంచి ముక్కజొన్న కంకులుతో మల్లెపాలెం తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.